Director Rajamouli: ‘దృశ్యం’ డైరెక్ట‌ర్‌పై రాజ‌మౌళి ప్ర‌శంస‌లు..

Director Rajamouli: మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ప్ర‌శంసించారు. తాను తీసిన దృశ్యం సినిమా ఎంతో అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌మౌళి.. డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌కు వాట్సాప్ చేశాడుDirector Rajamouli. దీనిని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశాడు జీతూ జోసెఫ్‌. ఆ మెసెజ్‌లోని విష‌యాల‌ను చూద్దాం.. తాను దృశ్యం2 సినిమా చూసిన త‌ర్వాత త‌న ఆలోచ‌న‌ల్ని దాని చుట్టూనే తిరిగాయ‌ని..

rajamouli

మొద‌టి సారిఇ తెలుగులో దృశ్యం విడుద‌లైన‌ప్పుడు తాను వెంట‌నే మ‌ళ్లీ ఒక‌సారి మ‌ల‌యాళ దృశ్యం సినిమా చూశాన‌ని రాజ‌మౌళి అంటూ మెసెజ్ చేశారుDirector Rajamouli. అలాగే ఈ సినిమా ద‌ర్శ‌కత్వంతో పాటు స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్‌, యాక్టింగ్ అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయ‌ని అన్నారు. ఈ సినిమా క‌థ ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో కూడి ఉంద‌ని ప్ర‌శంసించారు. దృశ్యం ఒక మాస్ట‌ర్ పీస్ అని, అంతే ఉత్కంఠ‌తో సీక్వెల్ తీసుకురావ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌ని చెప్పారు. జీతూ నుంచి మరికొన్ని మాస్ట‌ర్ పీస్ సినిమాలు రావాల‌ని ఆశిస్తున్నాన‌న్నారుDirector Rajamouli. ఇక ఈ చిత్రంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, ఆయ‌న‌కు జోడీగా మీనా న‌టించింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్‌లో విడుద‌లై మంచి విజ‌యం అందుకున్నారు.