Tollywood: కృతి ఫోటోల‌ను చూసి హీరోయిన్‌గా ఫిక్స్ చేశా: ఉప్పెన డైరెక్ట‌ర్

Tollywood: ఉప్పెన చిత్రం ఇటీవ‌లే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్ల సునామిగా సృష్టిస్తుందనే విష‌యం తెలిసిందే. ఇందులో డెబ్యుగా మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించి.. ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించారు. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ కృతిశెట్టి త‌న అందంతో పాటు హావాభావాల‌తో కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో ర‌ప్పించేలా చేసింది ఉప్పెన సినిమా. అలాగే మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్ పాత్ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేసింది. అయితే Tollywoodఈ సినిమా హీరోయిన్ విష‌యంలో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఇటీవ‌లే జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్న తెలిపాడు. ఈ సినిమాకు తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంద‌ని అనుకున్నా.

Uppena Heroine

అనుకున్న‌ట్టుగానే మ‌నీషా అనే తెలుగుఅమ్మాయిని ఎంపిక చేశాం.Tollywood ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ప్రారంభించగా.. మ‌రోవైపు అదేస‌మ‌యంలో కృతి శెట్టి ఫోటోల‌ను చూసాను. దీంతో సందిగ్దంలో ప‌డ్డాను. ఆ త‌ర్వాత నా గురువు సుకుమార్ గారు ద‌గ్గ‌రికి వెళ్లి విష‌యం చెప్పాను. నీ క‌న్నా నా క‌న్నా సినిమా గొప్ప‌ది. దానికి అన్యాయం చేయ‌కూడ‌దు. ద‌ర్శ‌కుడిగా నువ్వు తీసుకునే నిర్ణ‌య‌మే స‌రైంది.. కొత్త అమ్మాయినే తీసుకో అని స‌ల‌హా ఇచ్చార‌ట‌. దీంతో వెంట‌నే కృతిని పిలిపించాను. చూడ‌గానే ఎంతో బాగుంది. బేబ‌మ్మ పాత్ర‌కు స‌రిపోతుంద‌ని అనిపించింది. కానీ నేను అనుకున్న విధంగా చేయ‌గ‌లుగుతుందా? అనే ఆలోచ‌న నా మ‌దిలో అనిపించింది.. అయినా ప‌ర్వాలేదు అనుకుని ధైర్యం చేసి Tollywoodఉప్పెన హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేశాం. అయితే ఈ సినిమాలో త‌నెంటో నిరూపించుకుంది అని బుచ్చిబాబు తెలిపారు. నిజంగానే ఈ సినిమాలో కృతి త‌న హావాభావాల‌తో ఎంతో ఆక‌ట్టుకుంది. నీ క‌న్ను నీలి స‌ముద్రం, ధ‌క్ ధ‌క్ ధ‌క్ అంటూ పాట‌ల‌తో కృతి కుర్ర‌కారును ఎంతో ఫిదా చేసింది. ‌