Tollywood: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి తెర‌పైకి వ‌స్తున్న‌ హీరో..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయ‌న శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ సినిమాలు తీశారు. 2003లో నితిన్ హీరోగా తెర‌కెక్కిన దిల్ సినిమాతో దిల్‌రాజు నిర్మాత‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌ను నిర్మించి Tollywood టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.

దీంతో ఆయ‌న ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనే టాప్ ప్రొడ్యూస‌ర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. Tollywood అలాగే దిల్‌రాజు కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న త‌మ్ముడు శిరీష్‌రెడ్డి కూడా ప‌లు చిత్రాలను స‌‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించేవాడు. Tollywood ఇక తాజాగా దిల్‌రాజు కుటుంబం నుంచి ఓ హీరో రాబోతున్నాడు. ఆ హీరోనే దిల్‌రాజు త‌మ్ముడు శిరీష్‌రెడ్డి కొడుకు ఆశిష్‌రెడ్డి హీరోగా మారుతున్నాడు. హుషార్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ హ‌ర్ష డైరెక్ష‌న్‌లో హీరోగా ఆశిష్‌రెడ్డి టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ మొద‌లైంద‌ని స‌మాచారం. కాగా Tollywood ప్ర‌ముఖ మ్యూజిక్‌డైరెక్ట‌ర్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.