Kollywood: అంతర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో ధ‌నుష్‌ ‘అసుర‌న్’ చిత్రం!

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన అసుర‌న్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 2019లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మ‌ణిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో.. మంజూ వారియ‌ర్‌, పశుప‌తి, కెన్ క‌రుణాస్ త‌దిత‌రులు ఈ Kollywoodచిత్రంలో న‌టించారు. దాదాపు వంద కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ మూవీని ప‌లు భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు పోటీ ప‌డ్డారు.

కాగా ఈ చిత్రం గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిత‌మైన అసుర‌న్ Kollywoodఇప్పుడు తాజాగా జ‌పాన్ దేశంలోని ఒసాకా న‌గ‌రంలో జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికైంది.. అలాగే ఉత్త‌మ చిత్రం విభాగంలోనూ పోటీ ప‌డుతుంది. ఇక Kollywood అసుర‌న్ చిత్రం తెలుగులో విక్ట‌రీ వెంక‌టేశ్ నార‌ప్ప‌గా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో వెంక‌టేశ్ భార్య‌గా ప్రియ‌మ‌ణి న‌టిస్తుంది.