Chennai: ఇంటి నుంచి సైకిల్‌పై వ‌చ్చి ఓటేసిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్‌..

Chennai: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌ ఉద‌యం నుంచి జ‌రుగుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో సామాన్యుల నుంచి సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల వ‌ర‌కు ఓటేయ‌డానికి వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతుంది.. ఉద‌ద‌యం నుంచే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. ఇప్ప‌టికే కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ త‌న భార్య‌తో క‌లిసి ఓటేశారు. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ సైకిల్ తొక్కుకుంటూ వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

దీంతో అభిమానులు ఆయ‌న‌ను ఫాలో అవుతూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ నేప‌థ్యంలో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చెన్నైలోని నీలాంక‌రైలోని ఓ పోలింగ్ కేంద్రానికి త‌న ఇంటి నుంచి సైకిల్ పై వ‌చ్చారు. అనంత‌రం క్యూలైన్‌లో నిల్చుని త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.