ద్రౌపదిగా దీపికా పదుకొనే… మహాభారతం మొదలయ్యింది

అల్లు అరవింద్, హిందీ ఫిల్మ్ మేకర్స్ ని కలుపుకోని ఇప్పటికే తాను రామాయణం సినిమాని తీయనున్నట్లు అనౌన్స్ చేశాడు. హ్రితిక్ రాముడిగా, ఎన్టీఆర్ కానీ ప్రభాస్ రావణుడిగా కనిపించనున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు బి టౌన్ నుంచి మరో సెన్సేషనల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ చేసిన ఈ ట్వీట్ సినీ అభిమానులని ఆశ్చర్యపరిచింది.

ఇప్పటికే రాణి పద్మావతిగా మెప్పించిన దీపికా, త్వరలో ద్రౌపదిగా నటించడానికి రెడీ అయ్యింది. మధు మంతెన, దీపికా కలిసి నిర్మించనున్న మహాభారతం సినిమాలో… దీపికా ద్రౌపదిగా కనిపించనుంది. వివిధ భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే నిర్మాతలు ఎవరు? ద్రౌపది ఎవరు అనే విషయం అనౌన్స్ చేశారు కానీ దర్శకుడు ఎవరు? మిగిలిన క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తున్నారు అనే విషయం మాత్రం చెప్పలేదు.