ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు. 

*ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ*…

సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా  సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

*దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ*…

దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

నటీ నటులు :

సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.

డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి 
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ 
లిరిసిస్ట్ :  భువనచంద్ర 
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్ 
ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ – ప్రీతి మోహన్  
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు 
నిర్మాత: వెంకట్ 
దర్శకత్వం: కె.టి.నాయక్బ్యానర్  వెంకట్ మూవీస్