BREAKING: ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి డేట్ ఖరారు

ప్రజలను భయపెడుతున్న కరోనా మహమ్మారికి ఇండియాలో విరుగుడు వచ్చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. తొలుత కరోనాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

CORONA VACCINE JANUARY 16

దేశవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు పుణే నుంచి వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం కావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.