Corona Virus: మ‌రో ప్ర‌ముఖ హీరోకు క‌రోనా.. అమీర్‌ను ఫాలోయ్యా అంటూ ఫ‌న్నీగా పోస్ట్‌!

Corona Virus: క‌రోనా వైర‌స్ దేశంలో మళ్లీ విజృంభిస్తుంది. ఈ నేప‌థ్యంలో సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌లే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న హోంఐసోలేష‌న్‌లో ఉంటూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నార‌నే విష‌యాన్ని అమీర్ ప్ర‌తినిధి తెలిపారు. ఇక తాజాగా ప్ర‌ముఖ సినీ న‌టుడు మాధ‌వ‌న్ కరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా తాను న‌టించిన త్రీ ఇడియ‌ట్స్ పోస్ట‌ర్ ద్వారా ఫ‌న్నీగా తెలిపాడు మాధ‌వన్‌..

త్రీ ఇడియ‌ట్స్ చిత్రంలో అమీర్‌ఖాన్‌, మాధ‌వ‌న్‌, శ‌ర్మాన్ జోషి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే రాంచో అమీర్‌ఖాన్‌ను ఫ‌ర్హాన్ ఫాలో అయ్యాడు. క‌రోనా మా వెంట ప‌డినా.. ఈ సారి దొరికిపోయాం. ఆల్ ఈజ్ వెల్‌.. ఈ సారి క‌రోనా మా రాజు శ‌ర్మాన్ జోషిని చేర‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాను. నేను కూడా త్వ‌ర‌గానే కోలుకుంటాన‌ని ట్వీట్ చేశాడు మాధ‌వ‌న్‌.. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.