రామ బాణం పుస్తకాన్ని ఆవిష్కరించిన టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు…

ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు గారు రచించిన రామ బాణం పుస్తకాన్ని ఈరోజు టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు గారు మాట్లాడుతూ.. కరోనా వల్ల నేను టెంపుల్ కు వచ్చి చాలా రోజులు అయినది. ఈకరోనా పూర్తిగా పోయి అందరూ ఆరోగ్యంగా వుండాలని భగవంతుడిని కోరు కుంటున్నాను. పూజారి రాంబాబు గారు రచించిన రామ బాణం పుస్తకము చాల బాగుంది. ఈ పుస్తకం మంచి ప్రజాధారణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు ఈ పుస్తకం ఆవిష్కరించటం చాల సంతోషం. ఈ పుస్తకం లో ముందు మాట చాల చక్కగా రాసారు. రామ బాణం పుస్తకం అందరు చదవాలని కోరుకుంటున్నా అన్నారు.