మెగాస్టార్ అభిమానులకు శుభవార్త

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఒక వెబ్‌సిరీస్‌లో నటించాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు వెబ్‌సిరీస్‌లో నటిస్తుండగా.. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. చిరు కూతురు సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మిస్తున్న ఒక వెబ్‌సిరీస్‌లో చిరు కెమియా రోల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

chiranjevi

చిరంజీవి పెద్ద కూతురు అల్లుడు సుస్మిత , విష్ణు ప్రసాద్ గోల్డ్ బ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ‘షూటౌట్ అట్ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌లో చిరంజీవి నటించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించగా.. త్వరలో జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశముంది. దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమా రీమేక్‌లో చిరంజీవి నటించే అవకాశముంది.