`ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సాయిసుశాంత్‌, చాందిని చౌదరి కొత్త చిత్రం ప్రారంభం

Chandini Chowdary New Film Launched

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు బి.ఎ స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విశ్వాస్ హ‌న్నుర్క‌ర్ నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర వ‌ర్మ డైరెక్ష‌న్‌లో `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సాయిసుశాంత్‌, సిమ్రాన్ చౌద‌రి, చాందిని చౌద‌రి హీరోయిన్స్‌గా కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కె.రాఘ‌వేంద్ర‌రావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంర్భంగా ..

నిర్మాత విశ్వాస్ హ‌న్నుర్క‌ర్ మాట్లాడుతూ – “కామెడీ.. ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌద‌రి, సిమ్రాన్ చౌద‌రి స‌హా మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌తో తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.

న‌టీన‌టులు:
సాయి సుశాంత్ రెడ్డి
చాందిని చౌద‌రి
సిమ్రాన్ చౌద‌రి
త‌నికెళ్ళ భ‌ర‌ణి
ప్రియ‌ద‌ర్శి
మకరంద్ దేశ్పాండే
శిశిర్ శ‌ర్మ‌
ఝాన్సీ
వినీత్‌కుమార్‌

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
నిర్మాత‌: విశ్వాస్ హ‌న్నుర్క‌ర్‌
ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వేంద్ర వ‌ర్మ‌
ర‌చ‌యిత‌: అక్ష‌య్ పూళ్ల‌
కెమెరా: సతీష్‌
సంగీతం: జోష్‌.బి
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్‌: శ్రీకాంత్ రామిశెట్టి