స్టేజ్ మీదే ఏడ్చేసిన కలర్ ఫొటో హీరోయిన్

తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా పాపులర్ అయిన ఈమె.. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన కలర్ ఫొటో సినిమాతో మరింత పాపులర్ అయింది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆహా యాప్‌లో విడుదల అవుతున్న సూపర్ ఓవర్ సినిమాతో చాందినీ చౌదరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

chandhini chowdary crying

ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చాందినీ చౌదరి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండగా.. డైరెక్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌కి గురై చనిపోయాడు. దానిని గుర్తుచేసుకుని చాందినీ చౌదని ఏడ్చేసింది. ఈ సమయంలో హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చాడు.