BIG BREAKING: సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్‌న్యూస్

కరోనా క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన కొత్త గైడ్‌లైన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. సినిమా థియేటర్ల యాజమాన్యాలకు సీటింగ్ కెపాసిటీని పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

THEATER SEATING CAPACITY

ప్రస్తుతం సినిమా హాల్స్, థియేటర్లలో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు సీటింగ్ కెపాసిటీని పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే సీటింగ్ కెపాసిటీని ఎంతవరకు పెంచిందనే విషయాన్ని కేంద్రం ప్రకటించలేదు. రెండు, మూడు రోజుల్లో దీనిపై కేంద్రం ప్రకటన జారీ చేయనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించింది.