కరోనా పాటల ఆల్బమ్ ను ఆవిష్కరించిన ” వి .వి .వినాయక్ “

కరోనా రక్కసి కరాళ  నృత్యాన్ని చూసి  ప్రపంచ పటమే  భయంతో  వణికి  పోతున్న  నేపధ్యంలో  ప్రజలను చైతన్యం  చేసే లక్ష్యంతో  రూపొందిన  ” కరోనా రక్కసి ” అనే  పాటల  ఆల్బమ్ ను  ప్రముఖ  సినీ దర్శకులు  వి .వి .వినాయక్  ఈనెల  16 వ తేదీన   ఆవిష్కరించారు. అభ్యుదయ సినీ దర్శకుడు  ” బాబ్జీ  ” రచించిన  యీ  పాటలను  ప్రజా నాట్యమండలి  గాయకుడు  ” లక్ష్మణ్  పూడి  ” ఆలపించారు.  యువ సంగీత దర్శకుడు  ” ప్రేమ్ ”  స్వరాలను  అందించారు. ఈ సంధర్భంగా  వి .వి .వినాయక్  మాట్లాడుతూ ”  కరోనా  రక్కసి విభృంజన ను చూసి  జనమంతా  విపరీతంగా  భయపడి పోతున్నారని, కానీ మనం చేయవలసినది  భయపడడం  కాదు,  జాగ్రత్తలు  తీసుకోవడం  అని  , యీ  విపత్తు సమయంలో  ఆర్ధికంగా   బలంగా  వున్న  వ్యక్తులందరూ  ఆర్ధికంగా  బలహీనంగా  వున్న పేద సాదలకు  అండగా  నిలబడి  మానవత్వాన్ని  చాటాలని   పేర్కొంటూ,  ప్రజలను చైతన్య పరిచేందుకై  యీ పాటల ఆల్బమ్ ను రూపొందిన  బాబ్జీ  , లక్ష్మణ్  పూడి గార్లను  అభినందించారు….!దర్శక రచయిత  బాబ్జీ   మాట్లాడుతూ    ” సమాజం లో  ఏ విపత్తు  వచ్చినా  స్పందించడం,  ప్రజల పక్షాన  నిలబడడం  కళాకారుల  బాధ్యత  అని, ఆ బాధ్యత తోనే  యీ పాటలను రూపొందించామని  ” అన్నారు. ప్రజా నాట్యమండలి గాయకుడు  , ఈ పాటల ఆల్బమ్  రూపకర్త  లక్ష్మణ్ పూడి  మాట్లాడుతూ  ” లాక్ డౌన్  ఎత్తి వేసిన తరువాత  ప్రజలలో  నిర్లక్ష్య ధోరణి  కనిపిస్తుందని,  ఎవరికి  వాళ్ళు  మాకు  ఏమి కాదు అనే భావన తో  బయట తిరుగుతున్నారని,  అలాంటి  జనాన్ని  చైతన్యపరచడానికే  యీ  పాటలను  రూపొందించామని ” తెలిపారు.