మహాసముద్రం సినిమాతో శర్వా హిట్ కొట్టడం గ్యరెంటినా?

శర్వానంద్.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్థానం సినిమాలో పోషించిన పాత్ర శర్వానంద్ కి చాలామంచి పేరు తీసుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా లాంటి సినిమాలు శర్వానంద్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత హీరోగా మారి శతమానం భవతితో భారీ హిట్ అందుకున్నాడు. అయితే శర్వానంద్ కి మళ్ళీ ఆ స్థాయి హిట్ ఇంతవరకు దక్కలేదు. రణరంగం, పడి పడి లేచెమనసు, జాను లాంటి సినిమాలు శర్వానంద్ కి బ్రేక్ ఇవ్వలేకపోయాయి.

ఇక ఇటీవల శ్రీకారం సినిమాతో వచ్చాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా మీద శర్వానంద్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చినప్పటికి కమర్షియల్‌గా మాత్రం హిట్ సాధించలేదు. దాంతో ఎలాంటి కథ ఎన్నుకుంటే మళ్ళీ భారీ హిట్ అందుకుంటాను అని ఆలోచించి ఫైనల్ గా ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో నటించే మహా సముద్రం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు.

మహా సముద్రంలో ముందు మాస్ మహారాజా రవితేజ, అక్కినేని నాగా చైతన్య నటిస్తారని ప్రచారం సాగింది. కానీ వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో చివరికి శర్వానంద్ ఓకే చేశాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా అయింది. రష్ చూసుకున్న చిత్ర బృందంకి మహా సముద్రం మీద గట్టి నమ్మకాలు కలిగాయట. భారీ హిట్ ఖాయమని ముఖ్యంగా శర్వానంద్ గట్టి నమ్మకంగా ఉన్నాడట. ఇక ఈ సినిమా సక్సెస్ ఒక్క శర్వానంద్ కి మాత్రమే కాదు దర్శకుడు మరో హీరో సిద్దార్థ్ కి హీరోయిన్స్ అనూ ఇమ్మానియేల్, అతిథి రావి హైదరీలకి చాలా కీలకం. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో.