సచిన్ జోషి చేతిలో రాజ్ కుంద్రా ఓటమి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేయడం  బాలివుడ్ వర్గాల్లో తీవ్ర సంచలన వార్త అయ్యింది. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నారన్న అభియోగంపై రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కీలక ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నట్లు సమచారం. పూర్తి వివరాలు సేకరించేందుకు కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాతో సహా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఫోర్న్ వీడియోలను యాప్ ద్వారా విడుదల చేస్తున్నారన్న అరోపణలపై రాజ్ కుంద్రా పై గత ఫిబ్రవరి నెలలోనే కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని పక్కా అధారాలు లభించడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ్ కుంద్రాకి మరో ఊహించని దెబ్బ తగిలింది.

అతను కోర్టులో జరిగిన యుద్ధంలో నటుడు, నిర్మాత అయిన సచిన్ జోషి చేతిలో ఓడిపోయాడు. ‘నిన్ను చుడాకా నేనుండలేను’, ‘నెక్స్ట్ ఎంట్?’ వంటి చిత్రాల్లో నటించిన సచిన్ జోషి… రాజ్ కుంద్రా, సత్యగ్ గోల్డ్‌లతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఈ సందర్భంలో సచిన్ జోషి గెలిచారు. 1 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని, సత్యగ్ గోల్డ్ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఊహించని ఎదురు దెబ్బ రాజ్ కుంద్రాని మరింత ఇబ్బంది పెట్టేదే.