భారత్ బంద్‌కు సినీ సెలబ్రెటీలు మద్దతు

ఇవాళ రైతుల పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బంద్‌కు మరింత మద్దతు లభిస్తోంది. తాజాగా సినీ సెలబ్రెటీలు కూడా రైతులకు అండగా నిలుస్తూ భారత్ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

PRIYANKA CHOPRA

దిల్జిత్ దోసంజ్, హర్భజన్, జస్బీర్ జాస్సీ, రితేష్ దేశ్ ముఖ్, దర్శకుడు హన్సాల్ మెహతా ఇప్పటికే రైతులకు తమ మద్దతు ప్రకటించగా.. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత బంద్‌ను మంగళవారం రైతులు పిలిపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు.

దేశ రాజధానికి వచ్చే అన్ని రహదారులను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇవాళ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శాంతియుతంగా రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.