బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో విషాదం.. కరోనాతో సోదరుడు మృతి

బాలీవుడ్ లో మరో విషధ ఘటన చోటుచేసుకుంది. దిగ్గజ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తమ్ముడు అస్లాం ఖాన్ (88) కరోనావైరస్ సోకడంతో కన్నుమూశారు. ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో అస్లాం తుది శ్వాస విడిచారు. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన తరువాత అస్లాం ఖాన్, మరో సోదరుడు ఎహ్సాన్ (90) తో కలిసి ఆగస్టు 16 న ఆసుపత్రిలో చేరారు.

ఆసుపత్రి అధికారుల తెలియజేసిన వివరాల ప్రకారం.. అస్లాంకు కోవిడ్-19 కాకుండా డయాబెటిస్, రక్తపోటు, ఇస్కీమిక్ గుండె జబ్బులు ఉన్నాయట. మరోవైపు, ఇషాన్ పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉందని, అతని ముఖ్యమైన అవయవాల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. అతను ఆసుపత్రిలో చేరినప్పటి నుండి నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్ తోనే ఉన్నారు. దిగ్గజ నటుడి కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.