యంగ్ టైగర్ సినిమాలో బాలీవుడ్ టైగర్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘జనతా గ్యారేజ్’. ఈ మూవీలో మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్స్ సమంత అక్కినేని, నిత్యా మీనన్ తారక్ సరసన నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పక్కా కమర్షియల్ సినిమాగా భారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యి 2016కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ యాక్టింగ్ అండ్ డాన్స్ కి నందమూరి అభిమానులంతా ఫిదా అయ్యారు. ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.

టాలీవుడ్ టైగర్ నటించిన ఈ మూవీలో బాలీవుడ్ టైగర్ తో నటింపజేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీస్ – సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ లో జాయింట్ వెంచర్ గా రానున్న ఈ సినిమా హిందీ రీమేక్ తో కొరటాల శివ బాలీవుడ్ లో అడుగు పెడతాడని టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ టాలీవుడ్ లో బిజీగా ఉంటే ప్రభుదేవా ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే మేకర్స్ సల్మాన్ కి 10 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే 2023 లో ‘జనతా గ్యారేజ్’ హిందీ రీమేక్ పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలీవుడ్ లో భారి సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా, రీసెంట్ గా ఈ రేస్ లోకి దిల్ రాజు కూడా వచ్చి నాంది, హిట్ సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హోస్ లో ఒకటైన మైత్రి కూడా జనతా గ్యారేజ్ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది.