సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం!!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు 16ఏళ్లుగా, ఖ‌లేజా 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారంద‌రూ ఈ సూప‌ర్ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 11ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌న్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిని రేపుతోంది.


సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. రాబోయే చిత్రాల్లో ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.