బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో “శకపురుషుడు” టీమ్

బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో “శకపురుషుడు” టీమ్
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిన్న రాత్రి హైదరాబాద్ ఐ .టి .సి . కోహినూర్ వైభవంగా గరిగాయి. ఈ వేడుకలకు ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీని ప్రత్యేకంగా ఆహ్వానించారు .
టి .డి .జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఎమ్ .ఏ .షరీఫ్ , రావుల చంద్రశేఖర్ రెడ్డి,అశ్విన్ , అట్లూరి , కంఠంనేని రవిశంకర్ ప్రసాద్, కాట్రగడ్డ ప్రసాద్ ,విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణ రావు , శ్రీపతి సతీష్, డి . రామ్ మోహన్ రావు , పారా అశోక్ కుమార్ , రఘురాం కాసరనేని. సతీష్ మండవ , కె .వి .ఎస్ . మధుసూదన రాజు సభ్యులుగా వున్నారు .
ఈ కమిటీ ఏప్రిల్ 28న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్ .టి .ఆర్. ప్రసంగాలను “శాసన సభ ప్రసంగాలు “, “చారిత్రిక ప్రసంగాలు ” పేరుతో వెలువరించారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్ర బాబు నాయుడు , తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , బాలకృష్ణ అతిధులుగా పాల్గొన్నారు.
గత నెల 20న హైద్రాబాద్ లో నిర్వహించిన రెండవ కార్యక్రమంలో “శకపురుషుడు “, ప్రత్యేక సంచిక ” జై ఎన్ .టి .ఆర్ ” వెబ్ సైట్ ను ఆవిష్కరించారు . ఎన్ .టి .ఆర్ .శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ కమిటీ చేసిన కార్యక్రమాలు అనూహ్యమైన విజయవంత కావడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చాయి . అందుకే బాలకృష్ణ తన జన్మ దిన వేడుకలకు ఎన్ .టి.ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీని ఆహ్వానించారు .
ఈ జన్మదినోత్సవ వేడుకల్లో కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ బాలకృష్ణకు శాలువాతో సత్కరించారు . తరువాత సభ్యుల ఆనందోత్సాహాల మధ్య బాలకృష్ణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భగీరథ, విక్రమ్ పూల “శకపురుషుడు” ప్రత్యేక సంచికను బాలకృష్ణకు బహుకరించారు . పారా అశోక్ కుమార్ నందమూరి వంశ వృక్షం చిత్ర పటాన్ని, బాలకృష్ణ చిత్ర పటాన్ని విజయ్ బహుకరించారు . ఇదేరోజు పుట్టిన రావుల చంద్ర శేఖర్ రెడ్డి , అట్లూరి నారాయణ రావు ను బాల కృష్ణ శాలువాలతో సత్కరించారు.
తన తండ్రి నందమూరి తారక రామారావు గారి శత దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించిన కమిటీని బాలకృష్ణ అభినందించి అందరికీ విందు ఏర్పాటు చేశారు . ఈ వేడుకల్లో నందమూరి రామకృష్ణ , మాగంటి మురళీ మోహన్ కూడా పాల్గొన్నారు .