Tollywood: డైరెక్ట‌ర్ క‌మ్‌, రైట‌ర్ క‌మ్‌. హీరో ఇలా అన్నీ తానై స‌క్సెస్ దిశ‌లో ఆ చిత్రం!

Tollywood: తానే హీరోగా, డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా ఓ యంగ్ కుర్రాడు చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌రు అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 29న‌ విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై Tollywood ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి, శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవ్వరూ నమ్మరు”చిత్రం..

aryankrishna film

సక్సెస్ సెలెబ్రేషన్స్ దేవి 70mm థియేటర్ దగ్గర జరిగాయి. Tollywood సినిమా పూర్తి అయిన అనంతరం చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు చిత్రం బాగుందని ప్రశంశించడంతో చిత్రంలో నటించిన నటీనటులు చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. అంనంతరం ప్రేక్షకుల మధ్యలో చిత్ర యూనిట్ సక్సెస్స్ సంబరాల్లో పాల్గొన్నారు.