Kollywood: తీవ్ర అస్వ‌స్థ‌తతో ఆసుప‌త్రి‌లో చేరిన ప్ర‌ముఖ న‌టుడు కార్తీక్‌!

Kollywood: త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు కార్తీక్ ఆనారోగ్య‌బారిన ప‌డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. కార్తీక్ మ‌నిద ఉరిమై క‌ట్చి పార్టీని స్థాపించి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.. అయితే ఈ సారి కూడా ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు.. ఈ నేప‌థ్యంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అన్నాడీఎంకే పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాగా త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీ అన్నాడీఎంకే కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు..

Artist karthik

ఈ క్ర‌మంలో ఆయ‌న శ‌నివారం రాత్రి ప్ర‌చారం ముగించుకుని ఇంటికి చేరారు. ఆయ‌న శ‌నివారం అర్ధ‌రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న్ని వెంట‌నే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంచితే కార్తీక్ తెలుగులో సీతాకోక చిలుక‌, అభినంద‌న‌, అన్వేష‌ణ వంటి చిత్రాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. తెలుగులో చివ‌ర‌గా క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓం3డి మూవీలో తండ్రి పాత్ర‌లో న‌టించారు కార్తీక్‌.