Tollywood: ‘ఏప్రిల్ 28న ఏం జ‌రిగింది’ పైర‌సీ చేసి యూట్యూ‌బ్‌లో అప్‌లోడ్‌.. ఆ త‌ర్వాత‌..

Tollywood: టాలీవుడ్‌లో పైర‌సీ, లీక్‌లు వంటి చాలా నేరాలు జ‌రుగుతున్నాయి.. ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే స్టిల్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. అలాగే అయ్య‌ప్ప‌కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌న్ స్టిల్‌ను కూడా లీక్ చేశారు.. ఇక తాజాగా రంజిత్‌, షెర్రీ అగ‌ర్వాల్ వీజీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వీరాస్వామి. జి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జ‌రిగింది పైర‌సీకి గురైంది. ఈ Tollywood చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 27న విడుద‌లై.. మంచి విజ‌యం ద‌క్కించుకుంది.

april 28 em jarigindhi

అయితే ఈ చిత్రం ప్రేక్ష‌క ఆద‌రాభిమానాల‌ను గెలుచుకుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని పైర‌సీ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వీరాస్వామి సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. వెంట‌నే ఈ ప‌ని చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఆయ‌న కోరారు. ద‌ర్శ‌కుడి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.. పైర‌సీ చేసిన వారిని క‌నుగోనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. Tollywood చిత్రాన్ని పైర‌సీ చేసిన వారిని క‌చ్చితంగా శిక్షిస్తామ‌ని ద‌ర్శ‌కుడికి హామీ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇక ఈ Tollywood చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌బ‌ర్ద‌స్త్ చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించారు.‌