Tollywood: టాలీవుడ్‌లోకి మ‌రో మెగా హీరో.. ఈ క‌థ‌లో పాత్ర‌లు క‌ల్పితం!

Tollywood: మెగాస్టార్ చిరంజీవి అంటేనే సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌న న‌టుడిగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు రావ‌డానికి ముందు ఆయ‌న సినీ క‌ష్టాల‌ను చాలా అనుభ‌వించాడు.. వాటిని ఎదుర్కొన్నాడు. సినీ ఇండ‌స్ట్రీలో అలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచే కాకుండా అప్‌క‌మింగ్ హీరోల‌కు కూడా మార్గ‌ద‌ర్శిగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న పేరుతో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా అనీ వాళ్ల‌కి న‌ట‌న రాదని కాదు.. చిరంజీవి నుంచి వ‌చ్చిన క్ర‌మ‌శిక్ష‌ణ‌.. న‌ట‌న ప్ర‌తిభ ఉంటే.. ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటే ఏ న‌టుడి అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌, అల్లుఅర్జున్‌, రాంచ‌ర‌ణ్‌, వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్‌, ఇప్పుడు ఉప్పెన‌తో భారీ హిట్ కొట్టిన వైష్ణ‌వ్‌తేజ్ ఇలా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాదు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

tollywood

ఇక తాజాగా మ‌రో మెగా హీరో ప‌వ‌న్ కొణిదెల హీరోగా ఈ క‌థ‌లో పాత్ర‌లు క‌ల్పితం అనే చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు బాబాయి వ‌రుస అవుతాడు అని.. త‌న చ‌దువు పూర్తి అయిన త‌ర్వాత త‌న తండ్రితో క‌లిసి చిరంజీవిగారిని క‌లిసాను.. న‌టుడు కావాల‌ని అనుకుంటున్నాను అంటే అప్పుడు చిరంజీవి న‌ట‌న‌కు సంబంధించిన మెళ‌కువ‌లు చెప్పి సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు పొందాలి అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం ఉండ‌దు. న‌ట‌న వ‌చ్చిన వాళ్లు మాత్ర‌మే ఇక్క‌డ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటారు అని చిరంజీవి చెప్పార‌ని ప‌వ‌న్ కొణిదెల ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇక‌ ఈ చిత్రంతో యంగ్ టాలెంట‌డ్‌ డైరెక్ట‌ర్ అభిరామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.