Tollywood: అన‌సూయ‌ పైట ప‌టారం అంటున్న కార్తికేయ‌..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ న‌టిస్తున్న తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా.. ఈ చిత్రానికి కొత్త ద‌ర్శ‌కుడు పెగ‌ళ్ల‌పాటి కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. దీంట్లో హాట్ యాంక‌ర్ అన‌సూయ ఐటెం సాంగ్ చేసింది.. కాగా ఈ పాట కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు..Tollywood

Anasuya Item Song

ఈ నేప‌థ్యంలోనే ఈ ఐటెంసాంగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర‌యూనిట్‌.. పైన ప‌టారం అంటూ సాగే ఐటెంసాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 4గంట‌ల 5నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఈ Tollywoodచిత్ర హీరో కార్తికేయ‌, అన‌సూయ లుక్ ఎలా ఉంటుందో చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఇందులో కార్తికేయ గిటార్ ప‌ట్టుకుని ఉంటే ప‌క్క‌నే అన‌సూయ వ‌య్యారంగా న‌డుము ఊపుతూ కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ స్వ‌రాలు అందిస్తున్నారు.. ఇక ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు Tollywoodచిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.