ఒక్క ఐటెం సాంగ్ కోసం అనసూయకు రూ.20 లక్షలు

బుల్లితెరపై యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జబర్దస్త్ బ్యూటీ అనసూయ.. ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తోంది. సినిమాల్లో కూడా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఒకవైపు యాంకర్‌గా.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బోల్డెంత సంపాదిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ ఆఫర్ కొట్టేసింది. ఒక ఐటెం సాంగ్‌లో నటించేందుకు రూ.20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్.

ANASUYA ITEM SONG

కార్తికేయ-లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో చావు కబురు చల్లగా అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అనసూయను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ 3 నిమిషాలు ఉండనుండగా… దీని కోసం రూ.20 లక్షల రెమ్యూనరేషన్‌ను అనసూయ తీసుకోనుందని టాక్. కాగా గతంలో మెగా హీరో సాయిధరమ్ తేజ నటించిన విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్‌లో అనసూయ నటించిన విషయం తెలిసిందే.