ప్రభాస్‌తో సమానంగా అబితాబ్ క్యారెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ పాన్ ఇండియాను సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో వైజయంతి సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో నటించనున్నట్లు ఇంతకుముందు సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ప్రభాస్, దీపికా, బిగ్ బీ ముగ్గురికి సమాన పాత్రలు ఉండనున్నాయట.

AMITAB

ఈ ముగ్గురి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయట. ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ జాతీయ స్థాయిలో మంచి డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు. దీంతో అతడు తెరకెక్కించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.