Tollywood: జాతిర‌త్నాలు టీంకు అల్లుఅర్జున్ ప్ర‌శంస‌లు..

Tollywood: న‌వీన్ పోలీశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతిర‌త్నాలు చిత్రం మార్చి 11న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయాన్ని న‌మోదు చేసుకుంది. కామెడీ డ్రామాగా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ Tollywood సినిమా మంచి విజ‌యాన్ని దక్కించుకోవ‌డంతో ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు విషేస్ తెలిపారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమా స్పందించారు.

Alluarjun

ఈ మ‌ధ్య కాలంలో ఇంత ఎక్కువ ఎప్పుడూ న‌వ్వ‌లేదంటూ Tollywood చిత్ర‌బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌త్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. నిన్న రాత్రి జాతిర‌త్నాలు చూశాను.. న‌వీన్ పోలీశెట్టి అద్భుతంగా న‌టించాడు.. అప్‌క‌మింగ్ హీరోగా న‌వీన్ న‌ట‌న ఎంతో ఆక‌ట్టుకుంది.. రాహుల్ రామ‌కృష్ణ చాలా సునాయ‌సంగా న‌టించాడు. ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా న‌ట‌న చాలా బాగుంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్‌, స్వ‌ప్నాద‌త్‌, ప్రియాంక‌ద‌త్‌ల‌కు అభినంద‌న‌లు.. ర‌థ‌న్ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇక చివ‌ర‌గాTollywood డైరెక్ట‌ర్ అనుదీప్‌కు మా అంద‌రిని ఇంత బాగా న‌వ్వించినందుకు స్పెష‌ల్ థ్యాంక్స్ అంటూ బ‌న్నీ ట్వీట్ చేశాడు.