మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి ఫిక్స్

టాలీవుడ్ హీరోలు వరుసగా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే హీరోలకు లాక్‌డౌన్ వల్ల కాస్త బ్రేక్ దొరికింది. దీంతో హీరోలు రానా, నితిన్, అఖిల్ లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి సిద్ధమైపోయాడు. అతడే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్. ఈ విషయాన్ని మెగా హీరో సాయిథరమ్ తేజ్ స్వయంగా బయటపెట్టాడు.

ALLU SIRISH

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిథరమ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా పెళ్లి గురించి సాయిథరమ్ తేజ్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీంతో అల్లు శిరీష్ తర్వాతే తన పెళ్లి ఉంటుందని సాయిథరమ్ తేజ్ చెప్పాడు. శిరీష్ తన కంటే పెద్ద అని, అందుకే తనకంటే ముందు అతడికి పెళ్లి జరుగుతుందన్నాడు. వచ్చే ఏడాదిలో శిరీష్ పెళ్లి జరగవచ్చన్నాడు. తన ఇంట్లో పెద్ద కొడుకుగా తనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉందన్నాడు.

తనకు పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్‌గానే ఉండటం ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు ఉన్నాయన్నాడు. చిన్నప్పటి నుంచి చాలా మిస్ అయ్యానని,వాటిని పూర్తి చేయాలని చెప్పాడు. కాగా ఇటీవల మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోపు వచ్చే ఏడాదిలో మెగా ఫ్యామిలీలో అల్లు శిరీష్ పెళ్లితో మరో వేడుక జరగనుంది.