Bollywood: ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ అక్ష‌య్.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌, ప‌రేశ్ రావెల్‌, కార్తిక్ ఆర్య‌న్, మ‌నోజ్ బాజ్‌పాయ్‌లు క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అక్ష‌య్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఆదివారం నాడు స్వ‌యంగా తానే ట్వీట్‌లో తెలిపారు. నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. హోక్వారంటైన్‌లో వైద్యుల సూచ‌న‌ల ప్ర‌కారం ప‌లు నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నాను అని ట్వీట్ చేశారు. కాగా తాజాగా ఆయ‌న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.. ఈ విష‌యం తెలుసుకున్న అక్ష‌య్ ఫ్యాన్స్‌ల్లో ఆందోళ‌నక‌ర‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి..

సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు అక్ష‌య్ వెంట‌నే కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. ఈ క్ర‌మంలో నా కోసం మీరు చేస్తోన్న ప్రార్థ‌న‌లు ఫలిస్తున్న‌ట్లున్నాయి.. మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా ఆరోగ్యం ప్ర‌స్తుతానికి బాగుంది.. కానీ ముందు జాగ్ర‌త్త‌గా వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాను.. త్వ‌ర‌లోనే తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని భావిస్తున్నాను.. ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండండి అని ట్వీట్ చేశారు. ‌