మళ్లీ రెడీ అంటున్న అఖిల్

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.

AKHIL

త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అఖిల్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు అఖిల్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో ఈ సినిమాతోనే అయినా హిట్ కొట్టి సక్సెస్ అందుకోవాలని అఖిల్ చూస్తున్నాడు.

ఇది ఇలా ఉండగానే.. అఖిల్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి దీని షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్‌గా అఖిల్ సరసన రష్మిక మందనాను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.