AK Remake: ప‌వ‌న్‌-రానాను ఒకేలా బ్యాల‌న్స్ చేయ‌డంలో ఆ డైరెక్ట‌రే బెట‌ర్‌: ఏకే నిర్మాత

AK Remake: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. రానాకు జోడీగా ఐశ్వ‌ర్య రాజేశ‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు ఫేం డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్ర్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు నిర్మాత నాగ‌వంశీ.

Powerstar

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ ప్రాజెక్టులోకి తీసుకోవ‌డం గురించి నాగ‌వంశీ మాట్లాడుతూ.. ఇందులో ఒకరు హీరో, ఒక‌రు విల‌న్ అని కాకుండా ఇద్ద‌రిని బ్యాల‌న్స్ చేయాలి.. హీరోల మ‌ధ్య ఈగో క్లాష్ క‌రెక్ట్‌గా ప్రొజెక్ట్ అవ‌డానికి స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్ర‌మ్ రాస్తే బెట‌ర్ అని అనుకున్నాం. అలాగే డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర టాలెంట్ ఫిల్మ్‌మేక‌ర్ విజువ‌ల్‌గా బాగా తీయ‌గ‌లుగుతాడానే న‌మ్మ‌కంతో డైరెక్ట‌ర్‌గా పెట్టుకున్నాం. ఇక ఇద్ద‌రు హీరోలు క‌లిసి చేస్తున్న సినిమా కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ అయితే బ్యాల‌న్స్ చేయ‌గ‌లడ‌ని అనుకున్నాం అని చెప్పుకొచ్చాడు.‌‌