బాహుబలి తరువాత ప్రభాస్ అతిపెద్ద చిత్రం.. బడ్జెట్ ఎంతంటే?

కోవిడ్ -19 మహమ్మారి అనేక పెద్ద చిత్రాల బడ్జెట్లను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తదుపరి నిర్మాతలు బడ్జెట్లను తగ్గించే ఆలోచనలో లేరు. ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఆదిపురుష్ అని టైటిల్ సెట్ చేసిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడు పాత్రలో నటించనున్నారు.

బాహుబలి తరువాత, ఆదిపురుష్ బడ్జెట్ పరంగా ప్రభాస్ అతిపెద్ద చిత్రంగా తెరకెక్కుతోంది. 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు షూటింగ్ కి మాత్రమే ఖర్చు అవుతుందని సమాచారం. ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. హిందీ మరియు తెలుగు భాషలలో చిత్రీకరించబడే ఈ సినిమాను తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్ కానుంది. పూర్తిగా ఈ పౌరాణిక కథను 3డి చిత్రంలో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక కియారా అద్వానీ సీత పాత్రలో నటించే అవకాశం ఉంది.