మల్ధీవులు వెళ్లే బ్యాచ్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్

హీరోయిన్స్ మాల్ధీవుల బాట పడుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్‌, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తాప్సి వెకేషన్ కోసం మాల్ధీవులకు వెళ్లారు. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ వారు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత యూఎస్, యూకేతో పాటు యూరప్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో మాల్ధీవులకు హీరోయిన్స్ వెళుతున్నారు.

అయితే ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ ఒక ఫొటో పెడటంతో ఆమె కూడా మాల్ధీవులకు వెళ్లిందేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో తాను మాల్ధీవులకు వెళ్లే బ్యాచ్ కాదని ఆదాశర్మ కౌంటర్ ఇచ్చింది. తాను మాల్ధీవులకు వెళ్లలేదని, షూటింగ్‌లో భాగంగా మహారాజాపురంలో ఉన్నానని చెప్పింది. తమిళనాడు, కేరళ మధ్య ఉండే మహారాజాపురంలోని అందమైన లోకేషన్స్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చెప్పింది.

ఈ సందర్భంగా ఒక సెల్పీ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ‘మేమంతా ఇక్క‌డికెలా వ‌చ్చామ‌ని అడ‌గొద్దు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఇంత ఎత్తైన ప్ర‌దేశానికి ఎక్కి షాట్ తీయ‌లేదు. నేను చాలా అదృష్ట‌వంతురాలిని అంటూ” వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.