కీయరా అద్వానీ ఆ హీరోతో డేటింగ్ చేస్తోందా?

అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మిలో హీరోయిన్ పాత్రలో నటించిన కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు ఒక రూమర్ ఉంది. ఏదేమైనా ఆ విషయంలో వారిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. కాని అక్షయ్ కుమార్ ఒక షోలో కియారా యొక్క ప్రేమ జీవితాన్ని బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కియారా అద్వానీతో కలిసి ఇటీవల ది కపిల్ శర్మ షోలో సందడి చేశారు.

ఈ షో యొక్క క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, కపిల్ శర్మ కియారా యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అడిగారు. దానిపై ఆమె సమాధానమిస్తూ.. నేను వివాహం చేసుకున్నప్పుడే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతాను అని కియారా చెప్పారు. దీనిపై కపిల్ కౌంటర్ వేశాడు. కియారా వివాహం చేసుకున్న వ్యక్తికి చప్పట్లు అంటూ.. ప్రస్తుతానికి, మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నాడు. ఇక తరువాత అక్షయ్ కుమార్ కూడా అలాంటి విషయాల్లో మంచి ఫార్ములాలు తెలిసిన అమ్మాయి కీయరా అంటూ మరో పంచ్ వేశారు. అంటే ఆమె తప్పించుకుంటోందని కౌంటర్ వేశారు. దీంతో ఆడియెన్స్ కి ఆమె ప్రేమలో ఉన్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది.