“నేను నా డెత్ బెడ్ మీద ఉన్నాను” అని అభిమానులకు సమాచారం ఇచ్చిన నటి దివ్య చౌక్సే కన్నుమూశారు.

బాలీవుడ్ నటి దివ్య్ చౌక్సే ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణానికి కొన్ని గంటల ముందు, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హృదయ విదారక పోస్ట్ చేసింది . “నేను చెప్పదలచుకున్నదానికి పదాలు సరిపోవు, కానీ ఇది నేను మీకు చెప్పే సమయం వచ్చింది , నేను నా డెత్ బెడ్ మీద ఉన్నాను. S ** t జరుగుతుంది. నేను బలం గా ఉన్నాను. బాధ లేని మరొక జీవితంలో కలుదాం. దయచేసి ప్రశ్నలు అడగొద్దు. మీరు నాకు ఎంత ముఖ్యమో ఆ దేవునికి మాత్రమే తెలుసు. DC బై. “

తాను కాన్సర్ తో బాధపడుతున్నాను అని హాస్పిటల్ లో ప్రశాంతమైన చావు కోసం ఎదురు చూస్తునాను అని మరో పోస్ట్ లో తెలిపారు .

మోన్జోయ్ జాయ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 2016 లో ‘హై అప్నా దిల్ తోహ్ అవారా’ చిత్రంతో దివ్‌యా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది

దివ్యవ్యా లండన్‌లో యాక్టింగ్ కోర్సు చేసి మోడలింగ్ వృత్తిని కొనసాగించినట్లు తెలిసింది. ఆమె కేవలం సినిమాల్లో కనిపించడమే కాదు, అనేక టీవీ షోలలో కూడా చేసారు.