టాలీవుడ్ నిండా డ్రగ్స్ బానిసలే ఉన్నారు-శ్రీరెడ్డి

సుశాంత్ మరణంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మీడియా ఛానల్స్ నుంచి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసిన ఈ డ్రాగ్ స్కాండల్ గురించే చర్చ. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి రియా చక్రవర్తి ఇరుక్కోవడం, రకుల్ లాంటి స్టార్ హీరోయిన్ పేర్లు బయటకి రావడంతో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. అయితే నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్ వరకే పరిమితం అయిన ఈ డ్రగ్స్ కేసు సంజనా పేరు బయటకి రావడంతో శాండల్ వుడ్ కి కూడా పాకింది. బుజ్జిగాడు సినిమాలో త్రిషకి చెల్లికి నటించిన సంజన పేరుని రియానే బయట పెట్టింది. నార్త్ నుంచి శాండల్ వుడ్ కి పాకిన ఈ డ్రగ్ స్కాండల్ ఇప్పుడు టాలీవుడ్ ని కూడా తాకేలా ఉంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే శ్రీరెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్‌పై మాట్లాడుతుంది. పక్క ఇండస్ట్రీస్ లోనే కాదు టాలీవుడ్ కూడా డ్రగ్స్ మత్తులోనే ఉందన్న సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి, సోషల్ మీడియాలో ఓ వీడియోని కూడా రిలీజ్ చేసింది. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటారని, రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పుకొచ్చిన శ్రీ రెడ్డి… పెద్ద పెద్ద హోటల్స్‌లో కూడా ఈ పార్టీలు జరుగుతుంటాయని.. అక్కడికి వచ్చిన వారంతా డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది. ఈ పార్టీల్లో కేవలం డ్రగ్స్ తీసుకోవడం మాత్రమే కాకుండా అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్లను వాడుకుంటారని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే.. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పేర్లను బయటపెడతానని చెప్పింది.