విడుదలకు ముందే ‘ఆచార్య’ మరో రికార్డు

మెగాస్టార్ చిరంజీవీ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే విడుదలకు ముందే ఆచార్య రికార్డులు సృష్టిస్తోంది. ఇండియాలోనే ఏ సినిమాకు వేయని అతి పెద్ద భారీ సెట్ వేయడంతో ఆ సెట్ రికార్డులకెక్కింది.

aditya music audio rights

ఈ క్రమంలో తాజాగా ఆచార్య సినిమా మరో రికార్డును తన ఘాతాలో వేసుకుంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.4 కోట్లకుపైగా ఖర్చు పెట్టి ఆచార్య ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు కోట్లు పెట్టి ఆడియో రైట్స్ కొనడం మాములు విషయం కాదని, టాలీవుడ్‌లో ఇదే హయ్యస్ట్ రికార్డు అని తెలుస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మే 13న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.