ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కోర్టు

మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు వెంటాడుతూనే ఉంది. ఓటుకు నోటు కేసుపై ఏసీబీ కోర్టు ఇంకా విచారణ చేపడుతూనే ఉండగా.. ఈ కేసులోని నిందితులు కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. నిన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు సెబాస్టియన్ ఉదయ్ సింహా హాజరవ్వగా… పాదయాత్రలో ఉండటం వల్ల రేవంత్ రెడ్డి హాజరుకాలేకపోయారు.

acb warning to revanth

ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నేడు విచారణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంది. ఇవాళ తప్పనిసరిగా హాజరుకావాలంది. అయితే ప్రస్తుతం అచ్చంపేట రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి పాదయాత్రగా వస్తున్నారు.