గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత అభిషేక్ నామా…
ఈ సందర్భంగా అభిషేక్ నామ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు వాసు,మోహిత్,బిల్డర్ సుధాకర్,ఎగ్జిక్యూటివ్ వాహబ్ పాల్గొన్నారు…