Tollywood: సందీప్‌కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ మూడో రోజు క‌లెక్ష‌న్ల్ ఎంతో తెలుసా..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టించిన తాజా చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. ఈ చిత్రం మార్చి 5న‌ విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. హ‌కీ క్రీడా క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్క‌గా.. ఇందులో హాకీ ప్లేయ‌ర్‌గా సందీప్ కిష‌న్ క‌నిపించి ప్రేక్ష‌కుల్లో ఎంతో అల‌రించాడు. ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించింది. ఆమె పాత్ర‌కు న్యాయం చేసింది ఈచిత్రంలో. ఈTollywood సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.

sandeep kishan

ఈ చిత్రం థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 4కోట్ల‌కు అమ్ముడవ‌గా.. విడుద‌లైన మూడ్రోజుల్లోనే ఈ సినిమా రూ. 3.08 కోట్ల షేర్ వ‌సూల్ చేసింది. మొత్తానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.6.30కోట్ల గ్రాస్ వ‌సూల్ చేసింది. నైజాం ఏరియాలో రూ.97ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో 10ల‌క్ష‌ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఇక హాకీ క‌థాంశంతో వ‌చ్చిన మొద‌టి Tollywood చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. ముర‌ళీశ‌ర్మ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు ఈచిత్రంలో న‌టించ‌గా.. హిప్ హాప్ త‌మిళ ఈ Tollywood చిత్రానికి స్వ‌రాలు అందించారు.