

ఖగోళ అద్భుతం వల్ల మిట్ట మధ్యాహ్నం నీడ రెండు నిమిషాల పాటు మాయం – ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు
ఖగోళ అద్భుతం వల్ల ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క కనిపిస్తుందని కాని ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు మాత్రం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని సుసత్యరేఖ వివరించారు.