“కాలమేగా కరిగింది” సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “కాలమేగా కరిగింది”. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన “కాలమేగా కరిగింది” సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘తను జతగా..’ పాటను విడుదల చేశారు.

‘తను జతగా..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా…శరత్ చంద్ర తిరునగరి డెప్త్ ఉన్న లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి ఆకట్టుకునేలా పాడారు. ‘తను జతగా..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘తను జతగా లేని కథలో, ఈ ఒంటరి పరుగెక్కడికో, తను నేరుగ తాకే సడిలో, ఈ తుంటరి స్మృతి లెక్కడివో..’ అంటూ ఎమోషనల్ లవ్ సాంగ్ గా సాగుతుందీ పాట.

నటీనటులు – వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు

టెక్నికల్ టీమ్
రచన దర్శకత్వం – సింగార మోహన్
ప్రొడ్యూసర్ – మరే శివశంకర్
బ్యానర్ – సింగార క్రియేటివ్ వర్క్స్
డీవోపీ – వినీత్ పబ్బతి
ఎడిటర్ – రా యోగేష్
మ్యూజిక్ డైరెక్టర్ – గుడప్పన్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)