నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను.. అనుపమ పరమేశ్వరన్

నటి అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు మూడు చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిందట. ప్రేమమ్ చిత్రంతో మలయాళ సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో తెలుగు ప్రజల్లో కూడా ఆదరణ పొందింది. దీని తరువాత, నటుడు ధనుష్ తో ఒక హిట్ సినిమా చేసి సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది.

తక్కువ వ్యవధిలో, ఆమె వరుస చిత్రాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రేమమ్ తో పాటు మొదటి మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిందట. సినిమా సెట్స్ లలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సిన పనులు దగ్గరుండి చూసుకునేదట. ఆమె డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఇక ప్రస్తుతం ఆమె ఆదర్శ్‌తో కలిసి డోంట్ నాట్ వాయిదా చిత్రంలో నటిస్తోంది. ఇప్పటివరకు నటిగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది అంటే భవిష్యత్తులో ఒక లేడి డైరెక్టర్ గా సినిమాను తెరకెక్కిస్తుందేమో చూడాలి.