పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ కథకు డైరెక్టర్ ఫిక్స్..?

pawan kalyan

పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను చేసుకుంటు వెళుతున్న విషయం తెలిసిందే. తక్కువ రోజుల్లో ఫినిష్ అయ్యే కథలు ఉంటే చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ అయిపోగానే క్రిష్, హరీష్ శంకర్ లతో కలవనున్నారు.

ఆ తరువాత సురేందర్ రెడ్డి సినిమాతో బిజీగా కానున్న పవన్ కుదిరితే అయ్యప్పన్ కొశీయుమ్ ప్రాజెక్టును కూడా ఈ మధ్యలోనే పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇక ఈ మల్టీస్టారర్ కథలో మరో హీరోగా రానా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ, వెంకటేష్ వంటి హీరోల పేర్లు వినిపించగా అవన్నీ రూమర్స్ అని తెలిపోయాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకి దర్శకుడిగా సాగర్ చంద్ర సెలెక్ట్ అయినట్లు మరో టాక్ వస్తోంది. కేవలం 35రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దసరా స్పెషల్ గా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.