ఎన్‌సిబి విచారణ తరువాత సోషల్ మీడియాలో దీపికా పదుకొనె.. స్పెషల్ పోస్ట్

deepika

దాదాపు నెల రోజుల ఎన్‌సిబి విచారణ తర్వాత దీపికా పదుకొనే సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చారు. సూపర్ స్టార్ ప్రభాస్ కోసం నటి మొదటి పోస్ట్ పోస్ట్ చేసింది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఎన్‌సిబిని ప్రశ్నించడంతో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరమైంది. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పెద్దగా స్పంధించలేదు.

ఇక ఈ బాలీవుడ్ నటి చాలా రోజుల తరువాత ఒక స్టార్ హీరోకు విషెస్ అందించడానికి సోషల్ మీడియాలో తిరిగి వచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. బాహుబలి ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీపికా పదుకొనే, పోస్ట్‌లో ఒక స్పెషల్ ఫొటో కూడా పోస్ట్ చేసింది, ‘ప్రియమైన ప్రభాస్, మీ పుట్టినరోజున మీకు మంచి ఆరోగ్యం మరియు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు గొప్ప సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాను.