
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు.
తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రశ్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్
డైరెక్టర్ – గౌతమ్ తిన్ననూరి


