
బాలీవుడ్లో డ్రగ్స్ నెక్సస్పై దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా నాలుగు పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. వారు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నటులని కూడా టాక్ వస్తోంది. బాలీవుడ్లో డ్రగ్స్ నెక్సస్తో సంబంధం ఉన్నట్లు ఆమెపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల నటులు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఎన్సిబి దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇక జయ నలుగురు నటుల పేర్లను పేరు పెట్టారు, వీరిని రేపు ఎన్సిబి విచారించే ఆవకాశం ఉంది. మూడు రోజులుగా జయాను విచారిస్తున్న అధికారులు నిర్మాత మధు మంతేనా గురించి కూడా పలు విషయాలను రాబట్టి అతన్ని కూడా విచారించారు. ఇక త్వరలోనే మరికొందరి స్టార్లకు నోటీసులు పంపే అవకాశం ఉందట. దానికి ‘ఎ-లిస్టర్స్’ అని పేరు పెట్టారని టైమ్స్ నౌ నివేదించింది. ఈ కేసులో ఎన్సిబి ఇప్పటివరకు మొత్తం 16 మంది నిందితులను అరెస్టు చేసింది. కైజాన్ ఇబ్రహీం, కర్ణ అరోరా, అబ్బాస్ లఖాని మరియు అనుజ్ కేశ్వని వంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 25 న దీపిక పదుకొనె, శ్రద్ధా కపూర్ మరియు సారా అలీ ఖాన్ లు సెప్టెంబర్ 26న విచారణకు హాజరుకావాలని కోరినట్లు సమాచారం.